నిరూపిస్తే మొత్తం రాసిస్తా.. లోకేష్‌కు ఎమ్మెల్యే అవంతి సవాల్

by Disha Web Desk 16 |
నిరూపిస్తే మొత్తం రాసిస్తా.. లోకేష్‌కు ఎమ్మెల్యే అవంతి సవాల్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తాను వందలాది ఎకరాల భూమిని భీమిలిలో కబ్జా చేశానంటున్న నారా లోకేష్ దానిని నిరూపించాలని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. అలా చేస్తే ఆ భూమి మొత్తం లోకేష్‌కు రాసిచ్చేస్తానని ఆయన చాలెంజ్ చేశారు. విశాఖ విలేకరులతో ఆయన మాట్లాడుతూ లోకేష్‌కు ధైర్యం ఉంటే భీమిలీలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ముందు లోకేష్ జ్ఞానం పెంచుకోవాలని సలహా ఇచ్చారు. విశాఖలో భూ కబ్జాలకు పాల్పడింది టీడీపీ నేతలేనని ఎదురు దాడికి దిగారు. పవన్ కళ్యాణ్ ఆత్మాభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారని, సీఎం పదవి ఇవ్వమని చంద్రబాబు చెప్పినా టీడీపీ వెంట పడుతున్నారని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకు దూరంగా పెట్టారని, పవన్‌ను ఎందుకు దగ్గరకు తీసుకున్నారో అర్ధం చేసుకోవాలని అన్నారు. లోకేష్ శంఖారావం సభ అట్టర్ ఫ్లాప్ అని సెటైర్ వేశారు. లోకేష్ సభకు స్పందన జీరో అని, ఎవరో రాసిన స్క్రిప్ట్ లోకేష్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ ప్రతి సభలో చూపిస్తున్నది ఎర్ర బుక్ కాదని, ఎర్రి బుక్ అని వ్యంగ్యంగా విమర్శించారు. సీఎం జగన్ ధైర్య వంతుడు కాబట్టేఎమ్మెల్యే సీట్లు మార్చరని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Next Story